మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మద్నూర్ ఇందిరా నగర్లో ఏర్పాటు చేసిన కొల్హాపూర్ మాత మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రాం పటేల్ మండపం కు వచ్చిన సందర్భంగా దుర్గామాత మండపం తరపున డాక్టర్ విజయ్ సన్మానం చేశారు. గ్రామ యువకులు సంప్రదాయ పద్ధతిలో మాలలు ధరించి ప్రతిరోజూ పూజలు, సేవలు చేస్తున్నారు.
ఉదయం, రాత్రి మంగళహారతులతో గ్రామమంతా భక్తి మయ వాతావరణం నెలకొంటోంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు సకల శ్రద్ధలతో పాల్గొంటున్నారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel
