మద్నూర్లో ఘనంగా రావణ దహనం
- మద్నూర్ మండలకేంద్రంలోని ఎల్లమ్మ బండల్లో విజయదశమి పండుగను ఈ ఏడాది మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రతీ ఏటిలాగే ఈసారి కూడా రావణ దహనం ఘనంగా నిర్వహించగా, వేలాది మంది గ్రామస్థులు పాల్గొన్నారు. ఉద్యోగానిమిత్తం బయటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వగ్రామానికి చేరుకుని ఉత్సవాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరితో ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ దసరా పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
మద్నూర్ లో ఆర్యసామాజ్ ఆధ్వర్యంలో బజాభజంతి బ్యాండ్ లతో ఊరేగింపుగా బయలు దేరి ఎల్లమ్మ బండల్లో ఆర్యసామాజ్ పెద్దలు రాజేందర్ సెట్ అద్వర్యంలో కొనసాగింది
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel

