మద్నూర్ మండలంలోని అoతపూర్, తడగూర్ పెద్ద గ్రామాల్లో సోమవారం మహిళల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాలలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, మిర్జాపుర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్, కొండ మాజీ సొసైటీ చైర్మన్ గంగాధర్, విట్టల్ గురిజి, హన్మాండ్లు స్వామి, సంగయ్యప్ప, వీరన్న, దత్తు, అఖీల్ ,మహిళ సంఘాల నాయకురాళ్లు, సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని నాయకులు పేర్కొన్నారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున అన్నీ వర్గాల మహిళలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
Sangayappa matapathi
CEO & Founder of appanewschannel

