• Sat. Dec 6th, 2025

ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

BySangayappa matapathi

Nov 26, 2025

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ గారు మల్లికార్జున్ గారికి అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందించారు.

జిల్లా కాంగ్రెస్ బలోపేతం కోసం సమిష్టిగా ముందుకు సాగాలని, నాయకులు–కార్యకర్తలను సమన్వయం చేసుకుని వ్యూహాత్మకంగా పనిచేయాలని మదన్ మోహన్ గారు సూచించారు. కామారెడ్డి జిల్లాలో సరికొత్త ఉత్సాహం సృష్టిస్తూ పార్టీ విజయాల కోసం కృషి చేస్తే తాను సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ భేటీలో  కాంగ్రెస్ నాయకులు భుజంగారి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాయి పటేల్ కూడా పాల్గొన్నారు.

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *