కామారెడ్డి జిల్లా, డోంగ్లీ మండలం, మొఘ గ్రామం:
గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మొఘ గ్రామ సర్పంచ్ బస్వంత్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో నీటి కొరత వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలతో సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.
గ్రామంలోని పలు ప్రాంతాల్లో కొత్త త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయడం, అలాగే పనిచేయకుండా ఉన్న చేతి పంపులను మరమ్మతు చేయించడం ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఎండాకాలంలో నీటి సమస్యలు తీవ్రంగా మారే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు గ్రామస్థుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రజల ఇబ్బందులను వెంటనే గుర్తించి పరిష్కారం చూపుతున్న తీరు పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
🗣️ గ్రామస్థులు మాట్లాడుతూ,
“మా గ్రామంలో త్రాగునీటి సమస్యను సర్పంచ్ బస్వంత్ గారు చాలా త్వరగా పరిష్కరించారు. ప్రజల సమస్యల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ అభినందనీయం” అని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ బస్వంత్ సేవలు గ్రామ అభివృద్ధికి దోహదపడుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
నీటి సమస్యలకు చెక్… ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్న మొఘ గ్రామ సర్పంచ్ బస్వంత్
