• Fri. Sep 11th, 2026

మద్నూర్ లో 20 న కాంగ్రేస్ సమావేశం-అధ్యక్షుడు దరాస్ సాయిలు

Avatar photo

BySangayappa matapathi

Nov 19, 2025

📢 మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య సమావేశం –

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కార్యకర్తల సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు మద్నూర్ మండలంలో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయబడింది.

జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంత్ రావు గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించబడుతున్నట్లు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ వార్ సాయిలు తెలిపారు.

మండల పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ స్థాయి, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు,
కార్యకర్తలు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు
అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, ప్రతి గ్రామం నుండి ఒక నాయకుడు మాత్రమే కాదు, అందరూ పాల్గొనేలా సమాచారం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి చేరే బాధ్యతను తీసుకోవాలి అని ఆయన తెలిపారు.
మండల స్థాయి పార్టీ బలోపేతానికి తీసుకునే కీలక నిర్ణయాలు,

గ్రామాల వారీగా పార్టీ అభిప్రాయాలు, అవసరాలు

వంటి అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

🗓 తేదీ: 20-11-2025 (గురువారం)
⏰ సమయం: ఉదయం 11:00 గంటలకు
📍 స్థలం: మద్నూర్ గురు ఫంక్షన్ హాల్

– దరాస్ వార్ సాయిలు
మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

Avatar photo

By Sangayappa matapathi

Sangayappa matapathi CEO & Founder of appanewschannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *